మారనున్న ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్

మారనున్న ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్

హైదరాబాద్,వెలుగు: ఏప్రిల్​లో జరిగే ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ మారనున్నది. ఒకే తేదీల్లో జేఈఈ మెయిన్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఉండడంతో తేదీలు మార్చనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ పరీక్షలుంటాయని ఫిబ్రవరిలో ఇంటర్ బోర్డు షెడ్యూల్ రిలీజ్ చేసింది. అప్పటికి జేఈఈ మెయిన్ షెడ్యూల్ రాలేదు. అయినా బోర్డు అధికారులు షెడ్యూల్ ఇచ్చారు. తాజాగా మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) జేఈఈ మెయిన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంట్లో ఏప్రిల్16 నుంచి 21 వరకు ఫస్ట్ సెషన్ ఎగ్జామ్ ఉంటుందని తెలిపింది. దీంతో ఏప్రిల్ 20న ఇంటర్ సెకండ్ లాంగ్వేజీ పేపర్–1, 21న సెకండ్ లాంగ్వేజీ పేపర్–2 పరీక్షలున్నాయి. దీంతో ఈ 2 పరీక్షల షెడ్యూల్ మార్పు జరగనుంది. జేఈఈ ప్రిపరేషన్​ కోసం స్టూడెంట్లకు కొంత టైం ఇస్తారా లేక ఈ 2 ఎగ్జామ్స్ మాత్రమే చివర్లో నిర్వహిస్తారా? అనేదానిపై బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై ఇవ్వాలో రేపో నిర్ణయం రానుంది.