
హీరోయిన్ అదా శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ ఎలర్జీ, డయేరియా కారణంగా ఆమెను ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల అబ్జర్వేషన్లో ఉన్నారు. అదా శర్మ నటించిన కమాండో మూవీ ప్రమోషన్ కు ముందు ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కమాండో మూవీలో అదా శర్మ భావనా రెడ్డి అనే పాత్రను పోషించారు.
ఈ చిత్రం 2023 ఆగస్టు 11 నుండి డిస్నీ+ హాట్స్టార్లో ప్రసారం కానుంది. ఆమె హెల్త్ బులెటిన్ ఇంకా వెలువడాల్సి ఉంది. అదా శర్మ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా అదా శర్మ ఇటీవల బ్లాక్ బస్టర్ చిత్రం ది కేరళ స్టోరీలో నటించింది. రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఓవర్సీస్ కలెక్షన్లలో రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇటీవల థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. . ట్రైలర్ విడుదలైన తరువాత వివాదాల్లో ఇరుక్కుంది. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.