కొమురవెల్లి మల్లన్న కల్యాణంలో పాల్గొన్న మంత్రులు

కొమురవెల్లి మల్లన్న కల్యాణంలో పాల్గొన్న మంత్రులు

మేల తాలాల మధ్య కొమరవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా పూర్తయింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎఫ్డీఎస్ చైర్మెన్ ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. కల్యాణానికి కానుకగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణం అనంతరం మంత్రి హరీష్ రావు మల్లన్న స్వామికి కిలోన్నర బంగారు కిరీటాన్ని అలకరించారు.

కల్యాణోత్సవం అనంతరం మంత్రులంతా కలిసి పట్నాల మండపం, లడ్డూ ప్రసాద కౌంటర్, బుకింగ్ కార్యాలయాలను ప్రారంభించారు. కల్యాణోత్సవానికి వచ్చిన  భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి కల్యాణానికి ఏ ఆటంకం లేకుండా పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.