- నీటి విడుదల ఆపేయాలని కేఆర్ఎంబీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు : తాగునీటి కోసం ఏపీకి కేటాయించిన కోటాను ఆ రాష్ట్రం పూర్తిగా వాడేసుకుంది. దీంతో నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి నీటి విడుదలను ఆపేయాల్సిందిగా ఏపీని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఏపీ ఈఎన్సీకి లేఖ రాసింది. ఈ నెల 12న జరిగిన బోర్డు త్రీ మెంబర్ కమిటీ మీటింగ్లో ఏపీకి 5.5 టీఎంసీలను తాగునీటి కోసం కేటాయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అదే రోజు నుంచి మంగళవారం వరకు నీటిని విడుదల చేసుకున్నది. ఈ 12 రోజుల్లో మొత్తం 5.5 టీఎంసీల నీటిని ఏపీ వాడుకున్నట్టు బోర్డు వెల్లడించింది. ఏ రోజు ఎంతెంత వాడుకున్నారన్న లెక్కలనూ విడుదల చేసింది.