జెనీవా : మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మే 13 నుంచి జూన్ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. మే 13 నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్ కేసులు బయటపడగా, ఆ తర్వాత నుంచి ఈ నెల 2 దాకా 780 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మంకీపాక్స్ వల్ల 7 దేశాల్లో 66 మరణాలు నమోదయ్యాయి.
ఇండియాలో మంకీపాక్స్ వైరస్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో మంకీపాక్స్ లక్షణాలు బయటకు వచ్చాయి. యూపీలోని ఘజియాబాద్లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. బాధితురాలి శరీరంపై దద్దర్లు రాగా, దురద ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో, శాంపిల్స్ సేకరించి పూణేలోని ల్యాబ్కు టెస్ట్ కోసం పంపినట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని వైద్యులు స్పష్టం చేశారు.