ప్రేమపెండ్లి చేసుకుందని తల్లి సూసైడ్

ప్రేమపెండ్లి చేసుకుందని తల్లి సూసైడ్
  •     మృతురాలు బీఆర్ఎస్ నేత, మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు భార్య

మధిర, వెలుగు : కూతురు ప్రేమ పెండ్లి చేసుకుందని మనస్తాపంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన  బీఆర్ఎస్ నేత, మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, విజయలక్ష్మి(45) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇటీవల రెండో కూతురు ప్రేమ పెండ్లి చేసుకుంది.

దీంతో విజయలక్ష్మి మనస్తాపం చెందిన ఆమె శనివారం ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్యానుకు చీరతో ఉరేసుకుంది. భర్త శ్రీనివాసరావు బోనకల్​లోని పెద్దకూతురు ఇంటికి వెళ్లొచ్చే సరికి భార్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెళ్లి చూడగా మృతి చెంది ఉంది. భర్త  ఫిర్యాదుతో కేసు నమోదు చేసి డెడ్ బాడీని బోనకల్​పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు.  

బీఆర్ఎస్​నేతలు తాతా మధుసూదన్, కొండబాల కోటేశ్వరరావు, లింగాల కమల్​రాజ్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు శ్రీనివాసరావు కుటుంబసభ్యులను పరామర్శించారు.