వేసిన రోడ్డుకే  మళ్లీ టెండర్

వేసిన రోడ్డుకే  మళ్లీ టెండర్
  • కలెక్టర్ కు కంప్లైంట్​చేసిన మల్కపేట గ్రామస్తులు

కోనరావుపేట, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో కంప్లీట్​చేసిన రోడ్డుకే మళ్లీ టెండర్ వేసి ప్రభుత్వ సొమ్ము కాజేయాలని ప్రయత్నిస్తున్న ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మంగళవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని బోయినిపల్లె స్కూల్ నుంచి కొమ్ము నర్సయ్య అనే వ్యక్తి ఇంటి వరకు రెండేళ్ల క్రితం మూడు విడతలుగా సీసీ రోడ్డు వేశారు. అదే రోడ్డుకు మళ్లీ టెండర్​వేయగా13 లక్షల నిధులు మంజూరయ్యాయని గ్రామస్తులు ఫిర్యాదులో ఆరోపించారు. ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు.