పశువుల అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసులు

పశువుల అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసులు

మూగ జీవుల అక్రమ రవాణా రోజు రోజుకీ పెరిగిపోతోంది. ములుగు జిల్లాలో అలాంటి ఘటనే మళ్లీ జరిగింది. జిల్లాలోని జంగాల్​పల్లి చెక్​పోస్ట్​వద్ద పోలీసులు జూన్​ 26న వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కంటైనర్​లో అక్రమంగా 70 గోవులను తరలిస్తున్న కంటైనర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశువులను తరలిస్తున్న ఇద్దరి వ్యక్తుల్ని అరెస్ట్​ చేశారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పశువులను రామప్ప సమీపంలోని గోశాలకు తరలించారు. పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.