షిండే గూటికి చేరిన మరో మంత్రి ఉదయ్ సమంత్

షిండే గూటికి చేరిన మరో మంత్రి ఉదయ్ సమంత్

ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే అసోంలోని గౌహతిలో క్యాంప్‌ నిర్వహిస్తుండగా ఆయనకు మద్దతు మరింత పెరుగుతోంది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. తాజాగా ఉన్నత విద్య, సాంకేతిక శాఖ మంత్రి ఉదయ్ సమంత్ సైతం షిండే గూటికి చేరుకున్నారు. ఈయన చేరికతో షిండే శిబిరంలో ఇప్పటి వరకు 8 మంది మంత్రులు చేరారు.ఇంతకుముందు ఏడుగురు మంత్రులు షిండే టీమ్ లో చేరిపోయారు.    

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే మరోసారి తిరుగుబాటు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. శివసేన పార్టీలోకి తిరిగి రావాలనుకునే వారికి తలుపులు తెరిచే ఉన్నాయని ఆదిత్య ఠాక్రే అన్నారు. దేశ వ్యతిరేకులైన రెబల్ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకోమని స్పష్టం చేశారు.