మరోసారి పెరిగిన పెట్రోల్ ధర..హైదరాబాద్ లో ఎంతంటే?

మరోసారి పెరిగిన పెట్రోల్ ధర..హైదరాబాద్ లో ఎంతంటే?

పెట్రోల్,డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై 35,డీజిల్ పై 18 పైసలు  పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. ప్రస్తుత పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 99 రూపాయల 51 పైసలకు చేరగా..లీటడర్ డీజిల్ ధర 89 రూపాయల 36 పైసలకు పెరిగింది. ఇక ముంబైలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర 105 రూపాయల 58 పైసలు, లీటర్ డీజిల్ ధర 96 రూపాయల 91 పైసలకు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయల 44 పైసలుగా ఉండగా..లీటర్ డీజిల్ ధర 93 రూపాయల 91 పైసలుగా ఉంది.

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 103 రూపాయల 41 పైసలు, లీటర్ డీజిల్ ధర 97 రూపాయల 40 పైసలకు పెరిగింది. ఇక రాజస్థాన్ జయపురలో లీటర్ పెట్రోల్ ధర 106 రూపాయల 27 పైసలు, లీటర్ డీజిల్ ధర 98 రూపాయల 47కు పెరిగింది. మే లో ఫస్ట్ టైం భోపాల్ లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. దాదాపు 12 రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. గత రెండు నెలల్లో పెట్రోల్,డీజిల్ ధరలు పది శాతం పెరిగాయి. గత నెలలో 16 సార్లు పెట్రోల్,డీజిల్ రేట్లు పెరిగాయి.