హెటిరో ల్యాబ్స్​లో ప్రమాదం.. విధినిర్వహణలో ఆపరేటర్​ మృతి

హెటిరో ల్యాబ్స్​లో ప్రమాదం.. విధినిర్వహణలో ఆపరేటర్​ మృతి

కుత్భుల్లాపూర్​ హెటిరో ల్యాబ్స్​ లో విషాదం చోటు చేసుకుంది.  విధి నిర్వహణలో ప్రొడక్షన్​ ఆపరేటర్​ మృతి చెందాడు. ఈ రోజు ( మే3)న  మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రమాదవశాత్తూ కెమికల్స్​ మిక్స్​ చేసే యంత్రంలో పడి మహేందర్​ (28) చనిపోయాడు. 

రసాయనాలను మార్చే క్రమంలో  తీవ్ర గాయాలు కావడంతో ఆపరేటర్​ను సమీపంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందాడు.  నిజామాబాద్​కు చెందిన మహేందర్​ మూడు సంవత్సరాలుగా ఫార్మా యూనిట్​ 3లో ఆపరేటర్​గా పనిచేయుచున్నాడు. అయితే మహేందర్​ మృతిని కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని..కేసు నమోదు  దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మీడియా ప్రతినిధులను కంపెనీలోకి అనుమతించకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి.