సికింద్రాబాద్ అల్వాల్లో దొంగలు రెచ్చిపోయారు. లోతుకుంటలోని లక్ష్మీనగర్లో ఒకే రోజు 4 ఇళ్ళల్లో చోరీలు చేశారు. సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లడంతో చేతివాటం చూపించారు దొంగలు. ఊళ్ల నుంచి ఇంటికి వచ్చి చూసుకునే లోపే దొంగతనం జరిగిందని చెబుతున్నారు బాధితులు. 4 ఇళ్లలో 19 తులాల బంగారం, 3 లక్షల నగదుతో పాటు వెండి వస్తువులు కూడా పోయాయని చెప్తున్నారు. బాధితుల కంప్లైంట్ తో పోలీసులు క్లూస్ టీమ్ తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాలనీల్లోని సీసీ టీవీ పుటేజ్ ను చూశారు పోలీసులు.
అటు మీర్ పేటలోనూ దొంగలు రెచ్చిపోయారు . మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో వరుసగా 7 ఇళ్లలో దొంగతనం చేశారు. పండుగకు ఊరెళ్లిన సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేశారని చెప్తున్నారు బాధితులు. ఇంట్లో ఉన్న బంగారం, నగదు దోచుకెళ్లారని చెప్పారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు.