రెచ్చిపోయిన దొంగలు.. సికింద్రాబాద్ లో భారీ చోరీ

రెచ్చిపోయిన దొంగలు.. సికింద్రాబాద్ లో భారీ చోరీ

సికింద్రాబాద్ అల్వాల్లో దొంగలు రెచ్చిపోయారు. లోతుకుంటలోని లక్ష్మీనగర్లో ఒకే రోజు 4 ఇళ్ళల్లో చోరీలు చేశారు. సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లడంతో చేతివాటం చూపించారు దొంగలు.  ఊళ్ల నుంచి ఇంటికి వచ్చి చూసుకునే లోపే దొంగతనం జరిగిందని చెబుతున్నారు బాధితులు.  4 ఇళ్లలో 19 తులాల బంగారం, 3 లక్షల నగదుతో పాటు వెండి వస్తువులు కూడా పోయాయని చెప్తున్నారు.  బాధితుల కంప్లైంట్ తో  పోలీసులు క్లూస్ టీమ్ తో  ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాలనీల్లోని సీసీ టీవీ పుటేజ్ ను చూశారు పోలీసులు.

అటు  మీర్ పేటలోనూ  దొంగలు రెచ్చిపోయారు . మీర్ పేట్  పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో  వరుసగా 7 ఇళ్లలో  దొంగతనం చేశారు. పండుగకు ఊరెళ్లిన సమయంలో ఇంటి  తాళాలు పగులగొట్టి  దొంగతనాలు చేశారని చెప్తున్నారు   బాధితులు. ఇంట్లో   ఉన్న బంగారం, నగదు  దోచుకెళ్లారని చెప్పారు. బాధితుల  ఫిర్యాదుతో  ఘటనా స్థలాన్ని  పరిశీలించి  క్లూస్ టీంతో ఆధారాలు  సేకరిస్తున్నారు పోలీసులు.