10 రూపాయల కాయిన్ పై ఎలాంటి నిషేధం లేదన్నారు రిజర్వ్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శుభ్రతో దాస్. అందరూ 10 రూపాయల కాయిన్స్ ని యాక్సెప్ట్ చేయాలని సూచించారు. నెక్లెస్ రోడ్ లో ఫినాన్షియల్ లిటరసీ రన్ ను శుభ్రతో దాస్ ప్రారంభించారు. RBI ఉద్యోగులతో పాటు స్టూడెంట్స్, యూత్ K రన్ లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకే ఫినాన్షియల్ లిటరసీ వీక్ గా జరుపుకుంటున్నామని రిజర్వ్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శుబ్రతో దాస్ చెప్పారు. ఆర్థిక వ్యవహారాలపై ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తామన్నారు. ఫేక్ మెసేజ్ లు, మెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మోసగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పారు. రన్ లో పాల్గొన్న దివ్యాంగులకు అవార్డులు అందజేశారు శుభ్రతో దాస్.
see more news