అప్పు కట్టలేదని అక్క కూతుర్నేకిడ్నాప్ చేసింది

అప్పు కట్టలేదని అక్క కూతుర్నేకిడ్నాప్ చేసింది

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు కట్టలేదనే కక్షతో అక్క కూతురినే కిడ్నాప్ చేసిందో కిలాడీ లేడి. 11 రోజులు గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసింది. మిర్యాలగూడకు చెందిన మంగమ్మ, కల్యాణిలు అక్కా చెల్లెల్లు. ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు వివాదంగా మారాయి. అక్క… చెల్లెలుకు బాకీ పడింది. ఎంతకూ అప్పు చెల్లించక పోవడంతో, ఈనెల 7న తన అక్క కూతురైన 14 ఏళ్ళ బాలికను కిడ్నాప్ చేసింది కల్యాణి. బాలిక మిస్సింగ్ పై బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో.. కల్యాణి కంగారుతో కిడ్నాప్ చేసిన బాలికను ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు… పోలీసులకు ఫిర్యాదు చేశారు.