శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు

రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి... బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో ఎయిర్ పోర్టు కంట్రోల్ రూమ్ కు వచ్చిన మెయిల్ ఫేక్ గా గుర్తించారు.