కర్నాటక ప్రభుత్వ స్కూల్‌‌లో హెడ్‌‌మాస్టర్​ను చితకబాదిన స్టూడెంట్లు

కర్నాటక ప్రభుత్వ స్కూల్‌‌లో హెడ్‌‌మాస్టర్​ను చితకబాదిన స్టూడెంట్లు

శ్రీరంగపట్న/న్యూఢిల్లీ: స్టూడెంట్‌‌తో అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్‌‌ హెడ్‌‌మాస్టర్‌‌‌‌ను తోటి అమ్మాయిలు చితకబాదారు. కర్నాటకలోని మాండ్య జిల్లా శ్రీరంగపట్నంలో ఈ ఘటన జరిగింది. కట్టేరి ప్రభుత్వ స్కూల్‌‌లో చదువుతున్న అమ్మాయిలు.. స్కూల్‌‌కు అనుబంధంగా ఉన్న హాస్టల్‌‌లో ఉంటున్నారు. హెడ్‌‌మాస్టర్‌‌‌‌ చిన్మయ ఆనంద మూర్తి ఈ మధ్య హాస్టల్‌‌లోని ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి హాస్టల్‌‌లో ఉన్న మిగతా స్టూడెంట్లకు చెప్పింది.

వారంతా కర్రలతో స్కూల్​కు వచ్చి హెడ్‌‌మాస్టర్​ను చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక క్లాస్‌‌ రూమ్‌‌లోకి వెళ్లి డోర్ వేసుకోబోయిన హెడ్‌‌మాస్టర్‌‌‌‌ను బయటకు గుంజుకొచ్చి కొట్టారు. హెడ్‌‌మాస్టర్‌‌‌‌ను కొడుతున్న వీడియో సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌ అయింది. హెడ్‌‌మాస్టర్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్ చేసి, పోక్స్‌‌ చట్టం కింద కేసు పెట్టారు. కాగా, అతని డ్యూటీ సాయంత్రం వరకే అయినా అర్ధరాత్రుళ్లు హాస్టల్‌‌కు వచ్చి, అమ్మాయిల రూమ్‌‌లను చెక్‌‌ చేసేవాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఇదేంటని అడిగితే, తాను కోఆర్డినేటర్‌‌‌‌నని, ఫుడ్​, సౌలత్​లు ఎట్లున్నయో చూసేందుకు వస్తున్నానని చెప్పేవాడన్నారు.