ఎవరి నిర్లక్ష్యం..? విద్యుత్ షాక్తో యువకుడు మృతి.. మరో వ్యక్తికి గాయాలు

ఎవరి నిర్లక్ష్యం..? విద్యుత్ షాక్తో యువకుడు మృతి.. మరో వ్యక్తికి గాయాలు

రంగారెడ్డి జిల్లాలో విద్యుత్ షాక్ తో ఓ యువకుడు మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్లలో ఈ ఘటన జరిగింది. విద్యుత్ పోల్పై రిపేర్ వర్క్స్ చేస్తుండగా ఉన్నట్టుండి కరెంటు సరఫరా కావడంతో.. రామావత్ హరి(30) అనే యువకుడు చనిపోయాడు. అంబోత్ మోహన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 

గాయపడ్డ మోహన్ ను వెంటనే ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. రామావత్ హరి, మోహన్ సొంతూరు మంచాల మండలంలోని చెన్నారెడ్డి గూడా గ్రామం. కాంట్రాక్టర్, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే హరి చనిపోయాడని, అతడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలం వద్ద ఆందోళన చేపట్టారు. విషయం తెలియగానే ఆదిభట్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.