తహసీల్దార్ పై గిరిజనుల దాడి

తహసీల్దార్ పై గిరిజనుల దాడి

మహబూబాబాద్​ జిల్లాలో తహసీల్దార్​పై గిరిజనులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సాలర్​ తండా సమీపంలో 551 సర్వే నంబర్​లో కోర్టు భవన నిర్మాణం కోసం భూసర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు వెళ్లారు. భూసర్వేకు వ్యతిరేకంగా అధికారులను గిరిజన యువత, మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ఘర్షణకు దారి తీసింది.

పలువురు గిరిజన రైతులు తహసీల్దార్​ ఇమ్మాన్యుయేల్​పై  రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో తహసీల్దార్​ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ని మహబూబాబాద్​ ఏరియా ఆసుపత్రికి తరలించారు.  అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.