కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి వ్యాక్సిన్ సిద్ధమవ్వచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. భారత్ బయోటెక్ కంపెనీ వారు మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్లు ఇచ్చారని ఆయన అన్నారు. అదే విధంగా శాంత బయోటెక్ వరప్రసాదరెడ్డి కూడా తనను కలిశారని చెప్పారు సీఎం. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఆగష్టు లేదా సెప్టెంబర్ నాటికి సిద్దమవుతుందని చెప్పారన్నారు. అదే కనుక జరిగితే, ప్రపంచానికే రిలీఫ్ ఇచ్చిన వారమవుతామని సీఎం అన్నారు.
రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ కూడా ఎక్కువగానే ఉందని సీఎం అన్నారు. ఏ పారామీటర్ చూసినా చక్కగా ముందుకు పోతున్నామని, ఈ కృషి ఇలాగే కొనసాగాల్సి ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
.