ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని కామేపల్లి క్రాస్ రోడ్ లో ఉన్న కనకదుర్గవైన్ షాప్ లో శుక్రవారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. కామేపల్లి ఎస్సై స్రవంతి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. షాపు లో నిల్వ ఉన్న సుమారు రూ.66,540 విలువ చేసే 11 కేసుల మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. షాపు నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై తెలిపారు. కాగా వైన్ షాప్
ను కారేపల్లి ఎక్సైజ్ సీఐ జూపికర్ అలీ, ఎస్సై రాఘవేంద్ర శనివారం పరిశీలించారు.
For More News..
