
అల్వాల్ వెలుగు : ఓ కుటుంబం పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది. డీఐ తిమ్మప్ప తెలిపిన ప్రకారం... అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధి శివానగర్ కాలనీలో నివాసముంటున్న ఆనంద్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో ఓ మ్యారేజ్ ఫంక్షన్కు హాజరయ్యేందుకు మూడు జుల క్రితం వెళ్లాడు.
సోమవారం రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. 8 తులాల బంగారం, 35 తులాల వెండి చోరీకి గురయ్యాయి. పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు.