
గచ్చిబౌలి, వెలుగు: పని చేస్తున్న ఇంటికి కన్నం వేసిన ఓ సర్వెంట్ తో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను కొల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మాదాపూర్లోని పోలీసు కార్యాలయంలో డీసీపీ డాక్టర్ జి.వినీత్ వివరాలు వెల్లడించారు. ఉస్మాన్నగర్లోని ముప్ప ఇంద్ర ప్రస్తాలో విల్లా నెంబర్188లో ముల్కల సుజాత అనే మహిళ నివాసం ఉంటోంది. రెండు నెలల క్రితం ఒడిశా రాష్ట్రం గోవిందపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ మాలిక్(28) ఈ విల్లాలో హోం సర్వెంట్గా జాయిన్ అయ్యాడు. ఇదే విల్లాలో చందన్అనే వ్యక్తి కూడా సర్వెంట్గా పని చేస్తున్నాడు. విల్లా ఓనర్ అప్పుడప్పుడూ తన బెడ్రూంలోని వార్డ్ బోర్డు నుంచి డబ్బులు తీసే సమయంలో ప్రభాకర్గమనించే వాడు.
ఎలాగైనా డబ్బులు కొట్టేయాలని ఒడిశాకు చెందిన జమ్మలమడుగులో నివాసం ఉండే తపన్దాస్(32), గోపన్పల్లిలో నివాసం ఉండే సచింద్రదాస్(48), రథికంఠ దాస్(26)లతో కలిసి ప్లాన్ వేశాడు. డిసెంబర్ 21న విల్లా ఓనర్ సుజాత పని నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు. దొంగతనం చేసేందుకు ఇదే ఛాన్స్గా భావించాడు. డిసెంబర్ 25న అర్ధరాత్రి సర్వెంట్ రూంలో చందన్ నిద్రపోతుండగా ప్రభాకర్ విల్లాలోని ఓనర్ బెడ్రూంలోకి వెళ్లి 75 తులాల బంగారం, 6.50 లక్షల క్యాష్ను దొంగలించి అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటికే కొండాపూర్లో వెయిట్ చేస్తున్న తపన్దాస్, సచింద్రదాస్, రథికంఠదాస్లను కలిశాడు. దొంగలించిన సొమ్ములో నుంచి లక్ష రూపాయలను తపన్దాస్కు ఇచ్చాడు. సచింద్రదాస్కు కొంత బంగారం ఇచ్చాడు. రథికంఠ దాస్ అలియాస్ దీపునకు రూ. 2.50 లక్షల క్యాష్ ఇచ్చాడు. అనంతరం ప్రభాకర్, తపస్ దాస్లు కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఉండే తపన్దాస్ ఇంటికి వెళ్లారు. దీపు ఒడిశాకు వెళ్లగా, సచింద్రదాస్ తిరిగి తాను నివాసం ఉండే గోపన్పల్లికి వెళ్లాడు.
పని పూర్తి చేసుకొని డిసెంబర్ 26 న ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చిన సుజాత వారం రోజుల తర్వాత బెడ్రూంలోని వార్డ్ బోర్డు చెక్ చేయగా అందులో ఉన్న బంగారం, క్యాష్ కనిపించ లేదు. ఈ నెల 9న కొల్లూరు పోలీసులకు కంప్లైంట్చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 15న దొంగలించిన బంగారాన్ని అమ్మేసేందుకు ప్రభాకర్, తపన్దాస్, సచింద్రదాస్, రథికంఠదాస్ గోపన్పల్లి గ్రామానికి వచ్చారు. సమాచారం అందుకున్న కొల్లూరు, మాదాపూర్ సీసీఎస్ పోలీసులు నలుగురు నిందితులను గోపన్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మొత్తం 963 గ్రాముల బంగారు, డైమండ్ అభరణాలు, రూ. 2.90 లక్షల క్యాష్ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఏడీసీపీ నర్సింహారెడ్డి, మియాపూర్ ఏసీపీ నర్సింహారావు, సీసీఎస్ ఏసీపీ శశాంత్రెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.