పని చేస్తున్న ఇంటికే కన్నం .. సర్వెంట్ తో పాటు మరో ముగ్గురు అరెస్ట్​

పని చేస్తున్న ఇంటికే కన్నం  ..  సర్వెంట్ తో పాటు మరో ముగ్గురు అరెస్ట్​

గచ్చిబౌలి, వెలుగు: పని చేస్తున్న ఇంటికి కన్నం వేసిన ఓ సర్వెంట్  తో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను కొల్లూరు పోలీసులు అరెస్ట్​  చేశారు.  బుధవారం మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పోలీసు కార్యాలయంలో  డీసీపీ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జి.వినీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలు వెల్లడించారు.  ఉస్మాన్​నగర్​లోని ముప్ప ఇంద్ర ప్రస్తాలో విల్లా నెంబర్​188లో ముల్కల సుజాత అనే మహిళ నివాసం ఉంటోంది.  రెండు నెలల క్రితం ఒడిశా రాష్ట్రం గోవిందపూర్​ గ్రామానికి చెందిన ప్రభాకర్​ మాలిక్​(28) ఈ విల్లాలో  హోం సర్వెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాడు.   ఇదే విల్లాలో చందన్​అనే వ్యక్తి కూడా సర్వెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నాడు.  విల్లా ఓనర్​ అప్పుడప్పుడూ తన బెడ్రూంలోని వార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు ​నుంచి డబ్బులు తీసే సమయంలో ప్రభాకర్​గమనించే వాడు.  

ఎలాగైనా డబ్బులు కొట్టేయాలని ఒడిశాకు చెందిన జమ్మలమడుగులో నివాసం ఉండే తపన్​దాస్​(32), గోపన్​పల్లిలో నివాసం ఉండే సచింద్రదాస్​(48), రథికంఠ దాస్​(26)లతో కలిసి ప్లాన్​ వేశాడు.  డిసెంబర్​ 21న విల్లా ఓనర్​ సుజాత పని నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు.  దొంగతనం చేసేందుకు ఇదే ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా భావించాడు.   డిసెంబర్​ 25న అర్ధరాత్రి సర్వెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూంలో చందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిద్రపోతుండగా ప్రభాకర్​ విల్లాలోని ఓనర్​ బెడ్రూంలోకి వెళ్లి  75 తులాల బంగారం, 6.50 లక్షల క్యాష్​ను దొంగలించి అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటికే కొండాపూర్​లో వెయిట్​ చేస్తున్న తపన్​దాస్​, సచింద్రదాస్​, రథికంఠదాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కలిశాడు.  దొంగలించిన సొమ్ములో నుంచి లక్ష రూపాయలను తపన్​దాస్​కు ఇచ్చాడు.  సచింద్రదాస్​కు కొంత బంగారం ఇచ్చాడు.  రథికంఠ దాస్​ అలియాస్​ దీపునకు రూ. 2.50 లక్షల క్యాష్​ ఇచ్చాడు.   అనంతరం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఉండే తపన్​దాస్​ ఇంటికి వెళ్లారు.  దీపు ఒడిశాకు వెళ్లగా, సచింద్రదాస్​ తిరిగి తాను నివాసం ఉండే గోపన్​పల్లికి వెళ్లాడు.

  పని పూర్తి చేసుకొని డిసెంబర్​ 26 న ఢిల్లీ నుంచి  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  తిరిగి వచ్చిన సుజాత వారం రోజుల తర్వాత బెడ్రూంలోని వార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు చెక్​ చేయగా అందులో ఉన్న బంగారం, క్యాష్ ​ కనిపించ లేదు.  ఈ  నెల 9న కొల్లూరు పోలీసులకు కంప్లైంట్​చేసింది.   కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  ఈ నెల 15న దొంగలించిన బంగారాన్ని అమ్మేసేందుకు ప్రభాకర్​, తపన్​దాస్​, సచింద్రదాస్​, రథికంఠదాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోపన్​పల్లి గ్రామానికి వచ్చారు.  సమాచారం అందుకున్న కొల్లూరు, మాదాపూర్​ సీసీఎస్​ పోలీసులు నలుగురు నిందితులను గోపన్​పల్లిలో అదుపులోకి తీసుకున్నారు.  వీరి నుంచి  మొత్తం 963 గ్రాముల బంగారు,  డైమండ్​ అభరణాలు, రూ. 2.90 లక్షల క్యాష్​ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. సమావేశంలో ఏడీసీపీ నర్సింహారెడ్డి, మియాపూర్​ ఏసీపీ నర్సింహారావు, సీసీఎస్​ ఏసీపీ శశాంత్​రెడ్డి, ఇన్​స్పెక్టర్​లు, ఎస్​ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.