గాజులరామారానికి చెందిన ఓ మహిళ సింప్టమ్స్ లేకపోయినా ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్చేయించుకుంటే, రిపోర్ట్లో పాజిటివ్ వచ్చింది. మిగతా నలుగురు ఫ్యామిలీ మెంబర్స్కు నెగిటివ్ వచ్చింది. ఇంట్లోనే ఉండే ఆమెకు వైరస్ ఎలా సోకిందో అర్థమవడం లేదు. మూసాపేటలో ఉండే ఓ వ్యక్తికి అనారోగ్య సమస్యలేవీ లేవు. ఆఫీసుకు వెళ్లడానికి కరోనా రిపోర్ట్ అవసరం పడడంతో టెస్ట్ చేయించుకుంటే, పాజిటివ్గా తేలింది. గాంధీలో చేరిన ఆయన గత నెల15న మరణించాడు.
హైదరాబాద్, వెలుగు :కరోనా లక్షణాలు లేవని దర్జాగా తిరిగే పరిస్థితి లేదు. ఎప్పుడు, ఎవరి నుంచి సోకిందో తెలియకుండానే పలువురు బాధితులుగా మారుతున్నారు. మేడ్చల్లో నమోదైన కేసుల్లో 30శాతం ఇలాంటివే ఉన్నాయి. ముందు జాగ్రత్తతో టెస్ట్ చేయించుకుంటే తప్ప నిర్ధారణ కావడం లేదు. లింక్ తెలియకపోవడం, కాంటాక్ట్ ట్రేసింగ్ మరింత సమస్యగా మారింది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డితో పోల్చితే మేడ్చల్ జిల్లాలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా.. గత 15 రోజుల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. 4,475 మందికి టెస్టులు చేయగా, 1,357 పాజిటివ్ వచ్చాయి. 24మంది చనిపోయారు. జిల్లాలో 2 టెస్టింగ్ సెంటర్లు ఉండగా, చాలామంది పేషెంట్లలో ఎలాంటి లక్షణాలూ ఉండడం లేదని డాక్టర్లు చెప్తున్నారు. సిటీ నుంచి రాకపోకలు చేసే క్రమంలో పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మెరుగైన టెస్టింగ్ ప్రక్రియ లేకనే..
రెవెన్యూ జిల్లాపరంగా మేడ్చల్ వేరే అయినా, కరోనా కేసుల పరిశీలన, పర్యవేక్షణ జీహెచ్ఎంసీ పరిధిలోనే నడుస్తోంది. జిల్లాలో ప్రైమరీ కాంటాక్టుల ట్రేసింగ్లో జాప్యం, మెరుగైన టెస్టింగ్ ప్రక్రియ లేకపోవడంతో వైరస్ స్ప్రెడ్ అవుతోంది. గ్రేటర్ పరిధిలోని ఏరియాల్లోనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంది.