పరిగిలో రెండు సర్కార్ బడుల మధ్య వివాదం

పరిగిలో రెండు సర్కార్ బడుల మధ్య వివాదం

పరిగిలో రెండు ప్రభుత్వ పాఠశాలల మధ్య వివాదం తలెత్తింది. స్కూల్  బిల్డింగ్ మాదంటూ మరో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు క్లాస్ రూంలకు తాళం వేశాడు. దీంతో రెండు రోజులుగా స్కూల్ వరండాలో విద్యార్థులు చదువుకుంటున్నారు.

భవనం ఉన్న స్థలం తమదే అని బాలుర ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు చెబుతుండగా..భవనం మాదే అని బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంటున్నారు.  పాఠశాలలకు తాళాలు వేయడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు,వారి తల్లిదండ్రులు  అయోమయానికి గురవుతున్నారు. మండల విద్యాధికారి వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.