ఒక్క చాన్స్ ప్లీజ్! : ఎమ్మెల్యే టికెట్ల కోసం బీజేపీ కార్యాలయంలో ఆశావాహుల క్యూ

ఒక్క చాన్స్ ప్లీజ్! : ఎమ్మెల్యే టికెట్ల కోసం బీజేపీ కార్యాలయంలో ఆశావాహుల క్యూ

బీఆర్ఎస్, కాంగ్రెస్ లోనే కాదు.. బీజేపీ పార్టీలోనూ ఎమ్మెల్యే టికెట్లకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. మూడో రోజు కూడా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. దరఖాస్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాన్ని బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాష్ జవడేకర్ పరిశీలించారు. ప్రస్తుతం ఆశావాహులు, వారి అనుచరులతో బీజేపీ కార్యాలయంలో కోలాహలం కనిపిస్తోంది. 

ఆసక్తికరమైన విషయం ఏంటంటే...ఇప్పటివరకు టికెట్ కోసం బీజేపీ ముఖ్యనేతలు దరఖాస్తు చేసుకోలేదు. బీజేపీ కీలక నేతలు ఏ నియోజకవర్గాల్లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటారు అనే దానిపై పార్టీలో ఆసక్తి నెలకొంది. బీజేపీ టికెట్ కోసం మరికొంత మంది సెకెండ్ గ్రేడ్ నాయకులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకునేందుకు  పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యాలయానికి నేతలు, వారి అనుచరులు తరలివస్తున్నారు. 
ఎమ్మెల్యే టికెట్ల కోసం బీజేపీ ఆఫీసుకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 

* ఖైరతాబాద్ టికెట్ కోసం మాజీ ప్రధాని పీవీ. నరసింహారావు మనవడు, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ దరఖాస్తు చేసుకున్నారు. 

* ఎల్బీనగర్ టికెట్ కోసం మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్వామలదేవి దరఖాస్తు చేసుకున్నారు.

* మహేశ్వరం టికెట్ కోసం శ్రీరాములు యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. 

* గోషామహల్ టికెట్ కోసం మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. 

* గజ్వేల్ కు టికెట్ కోసం OU JAC నేత సురేష్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు.