
చెన్నూర్,వెలుగు: మండలంలోని బుద్దారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 20 మంది స్టూడెంట్లకు ఒక్కరే టీచర్ ఉన్నారు. టీచర్ వెంకటేష్ రాష్ర్ట విద్యాశాఖ ప్రవేశపెట్టిన 'తొలిమెట్టు' కార్యక్రమంలో భాగంగా జూన్ 30, 31, ఆగస్టు 1 తేదీల్లో మూడు రోజులు ట్రెయినింగ్కు వెళ్లారు. రూల్స్ ప్రకారం సింగిల్ టీచర్ లీవ్ పెట్టినా, ట్రెయినింగ్కు వెళ్లినా ఎంఈవో ముందస్తుగానే సమీపంలోని స్కూల్ నుంచి మరొక టీచర్ను అక్కడ నియమించాలి. వెంకటేష్ స్థానంలో మూడు రోజులపాటు మరో టీచర్ను బుద్దారం స్కూల్లో నియమించినట్టు ఎంఈవో రాధాకృష్ణ చెప్పగా, అక్కడ ఎవరూ విధులు నిర్వహించడం లేదు. సోమవారం ఈ స్కూల్కు తాళం ఉండగా, స్టూడెంట్లు ఇండ్ల దగ్గర ఆడుకుంటూ కనిపించారు. 'ఇయ్యాల సార్ రాలే.. ఆయమ్మనే వంట చేసి మధ్యాహ్న భోజనం పెట్టింది' అని పిల్లలు చెప్పారు. డీఈవో స్పందించి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు స్కూల్ ఆవరణ అంతా బురదమయంగా మారింది. బడిలో పిల్లలకు దోమలు కుడుతున్నాయని తెలిపారు. టాయిలెట్స్ వాడే పరిస్థితి లేదు.