
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీక్షకు అనుమతి లేదంటూ ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు. అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా అదుపులోకి తీసుకుని.. ఓయూ పీఎస్ కు తరలించారు.
తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం నుండి హామీ వచ్చే వరకు తాము దీక్ష విరమించబోమని స్పష్టం చేశారు. దీక్షకు మద్దతుగా కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా మద్దతు తెలిపారు. దీక్షకు అనుమతి లేదు అంటూ వారిని అరెస్టు చేశారు ఓయూ పోలీసులు.