సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి: గౌతమ్ సవాంగ్

సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి: గౌతమ్ సవాంగ్

ఇతర ప్రాంతాలనుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవారికి బోర్డర్లలో థర్మల్ స్క్రీనింగ్ తప్పని సరి అన్నారు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్. ఏపీకి వచ్చే వారు స్పందన పోర్టల్ ద్వారా పర్మిషన్ తీసుకుని పాస్ పొందిన తర్వాతనే రావాలని సూచించారు. అంతేకాదు వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలన్నారు.

పాస్ లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకూ అనుమతించబోమని స్పష్టం చేశారు డీజీపీ గౌతమ్. రాత్రి పూట అత్యవసర, నిత్యావసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందన్నారు.