నాగర్ కర్నూల్ లో.. తప్పించుకున్న దొంగలు

నాగర్ కర్నూల్ లో.. తప్పించుకున్న దొంగలు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్లాస్టిక్  పైపులు, విద్యుత్  తీగలు చోరీ చేసిన దొంగలు వాటిని అమ్మడానికి వచ్చి పోలీసులను చూసి పరరయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. వివిధ గ్రామాల్లో విద్యుత్​ తీగలు, ప్లాస్టిక్  పైపులు చోరీ చేసి పట్టణంలోని రవి టాకీస్  పక్కనే ఉన్న పాత ఇనుప సామాను

దుకాణంలో అమ్మడానికి ఆటోలో తీసుకొచ్చారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులను చూసి ఆటోను రోడ్డుపై వదిలేసి పారిపోయారు. ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.