- హాస్టల్ విద్యార్థులను టార్గెట్ చేసిన దొంగలు
- పోచారం యమ్నాంపేటలో ఘటన
ఘట్కేసర్, వెలుగు: వేసవిలో రాత్రి ఉక్కపోత తట్టుకోలేక హాస్టల్ గది తలుపులు తెరిచి నిద్రపోయిన విద్యార్థులను దొంగలు టార్గెట్ చేశారు. ఏకంగా 5 ల్యాప్టాప్లు, ఒక మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. పోచారం పరిధి యమ్నాంపేటలోని నిత్యశ్రీ బాయ్స్ హాస్టల్లో పలువురు శ్రీనిధి బీటెక్ కాలేజీ విద్యార్థులు ఉంటున్నారు. ఈ నెల 17న రాత్రి ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో రూమ్తలుపులు తెరిచి నిద్రపోయారు.
ఇదే అదునుగా అర్ధరాత్రి 1:40 గంటల సమయంలో దొంగలు లోపలికి చొరబడ్డారు. ఆదిప్రణీత్, అతని రూమ్మేట్ రంగా శ్రీఫణికి చెందిన రెండు ల్యాప్టాప్లతో పాటు, పైఅంతస్తులో ఉంటున్న అభిజిత్కు చెందిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, నాగ ఆదిత్య, జశ్వంత్కు చెందిన మరో రెండు ల్యాప్టాప్లను ఎత్తుకెళ్లారు. హాస్టల్లోకి దర్జాగా వస్తున్న దొంగల ఫొటోలు సీసీ ఫుటేజీలో రికార్డు కాగా, దాని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
