 
                                    - ట్యాక్స్ చెల్లింపుల్లో తేడా
- జాప్యం ఉండడంతో రైడ్స్!
- కొనుగోళ్లు, అమ్మకాల డాక్యుమెంట్ల పరిశీలన
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్మానేపల్లి జ్యువెల్లర్స్లో మూడో రోజైన గురువారం కూడా ఐటీ రైడ్స్కొనసాగాయి. ఐటీ లెక్కల్లో తేడాలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మూడు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్లోని మానేపల్లి జ్యువెల్లర్స్ లో ఏటా వెయ్యి నుంచి రూ.1.250 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని ఐటీ అధికారులకు సమాచారం అందింది. వ్యాపార లావాదేవీల్లో కొనుగోలు, అమ్మకాలపై ట్యాక్స్ల చెల్లింపు విషయంలో జాప్యం జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మానేపల్లి జువెల్లర్స్ లోని వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాల వివరాలపై ఆరా తీస్తున్నారు.

 
         
                     
                     
                    