ఈ సంవత్సరం స్పెషల్ సంక్రాంతి : గవర్నర్ తమిళిసై

ఈ సంవత్సరం స్పెషల్ సంక్రాంతి : గవర్నర్ తమిళిసై

 తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. అందరూ ఆనందంగా ఉండాలని  తాను భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానట్టు చెప్పారు. రాజ్ భవన్ లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంక్రాంతి అందరికీ స్పెషల్ అని అన్నారు. ఎందుకంటే రామ మందిరం ప్రారంభం కాబోతుందని చెప్పారు. రామ మందిరం పాటను తెలుగు, హిందీ బాషలలో విడుదల చేస్తున్నామని అన్నారు.

తాను ఢిల్లీ వెళ్తున్నట్టు తమిళీ సై చెప్పారు. సంక్రాంతి పండుల వేడుకల కోసం మాత్రమే వెళ్తున్నానని ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటన కాదని తెలిపారు. తెలంగాణ సిస్టర్ కాబట్టి ఇక్కడ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నానని తమిళనాడు డాటర్ కాబట్టి అక్కడికి వెళ్లి సెలెబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తానని తమిళి సై అన్నారు.