అనాథాశ్రమం నుంచి అమ్మ చెంతకు

అనాథాశ్రమం నుంచి  అమ్మ చెంతకు

పది రోజుల క్రితం తప్పిపోయిన ముగ్గురు పిల్లలు క్షేమంగా తల్లి చెంతకి చేరారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఏడేళ్ల దేవికతో పాటు, గిరీష్, అరబ్ అనే ముగ్గురు పిల్లలు పదిరోజుల క్రితం తప్పిపోయి వరంగల్ కు వచ్చారు. దీంతో రైల్వే పోలీసులు చిన్నారులను చైల్డ్ లైన్ సహాయంతో శ్రీ రాజరాజేశ్వరి అనాధాశ్రమానికి చేర్చారు. భూపాల్ లోని సియర్ జిల్లాకు చెందిన రాజకుమారి తన పిల్లలు తప్పిపోయారంటూ వెతుకుతున్న క్రమంలో  రైల్వే పోలీసుల ద్వారా సమాచారం అందుకుంది. పిల్లల ఆచూకీ తెలియడంతో వెంటనే ఆశ్రమానికి చేరుకుంది. పిల్లలకు ఆశ్రయం కల్పించిన అనాధాశ్రమ నిర్వాహకులకు ధన్యావాదాలు తెలిపారు. పిల్లలు తల్లి చెంతకు చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు అనాథాశ్రమం నిర్వాహకులు.