ముగ్గురు కూతుర్లను చంపిన తండ్రి

ముగ్గురు కూతుర్లను చంపిన తండ్రి

ముగ్గురు కూతుర్లను చెరువులో ముంచి చంపాడు ఓ తండ్రి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో జరిగింది. ఫయాజ్ అనే అతను జూదానికి బానిసై తరచూ భార్యతో కొట్లాడేవాడు. ఇందులో భాగంగా… గురువారం సాయంత్రం కార్డ్స్ ఆడటంకోసం నగదు ఇవ్వాలంటూ భార్యను అడిగాడు. అందుకు నిరాకరించిన భార్యతో కొట్లాడాడు. శుక్రవారం పొద్దున అతని ముగ్గురు కుమార్తెలు అఫియా(10), మహిన్(9), జోయా(7) లను గ్రామానికి దగ్గరవున్న రాజారామ్ దుబ్బ చెరువు దగ్గరకు తీసుకెళ్లి నీటిలో ముంచి హత్య చేశాడు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.