ఢిల్లీలో ముగ్గురు ISIS‌ ఉగ్రవాదులు అరెస్ట్

ఢిల్లీలో ముగ్గురు ISIS‌ ఉగ్రవాదులు అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలోని స్పెషల్ సెల్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ISIS ‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం దేశ వ్యాప్తంగా రెడీ అవుతున్న సమయంలో ఈ ఘటన జరగడం దేశ రాజధానిలో కలకల సృష్టిస్తోంది. ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ఇవాళ(గురువారం) ఉదయం జరిగిన ఓ ఎన్‌కౌంటర్ తర్వాత ISIS తో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడినట్టు ఢిల్లీ పోలీస్ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాయి.