హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. సాక్షాత్తు అసెంబ్లీ ఎదురుగా చోరీకి పాల్పడ్డారు. గన్ పార్క్ ముందు ఉన్న మూడు మ్యాన్ హోల్ లను ఎవరికి తెలియకుండా ఎత్తుకెళ్లారు. దాదాపుగా ఒక్కో ఐరన్ మ్యాన్ హోల్ 30కిలోల బరువు ఉంటుందని తెలుస్తోంది.
గన్ పార్కు లో ఉండే సెక్యూరిటీ సిబ్బంది దీనిని గుర్తించి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమోరాల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మ్యాన్ హోల్స్ లో ఎవరు పడకుండా జెండాలు పెట్టారు భద్రత సిబ్బంది.