సైబరాబాద్ ​పోలీసులకు మూడు మెడల్స్

సైబరాబాద్ ​పోలీసులకు మూడు మెడల్స్

గచ్చిబౌలి, వెలుగు: ఆల్ ఇండియా పోలీస్​డ్యూటీ మీట్–2023లో సైబరాబాద్ పోలీసులు ప్రతిభ కనబర్చారు. 2 గోల్డ్​ మెడల్స్, ఒక సిల్వర్​మెడల్ సాధించారు. మెడల్స్​సాధించిన పోలీస్​అధికారులను సైబరాబాద్​సీపీ అవినాష్​మహంతి సోమవారం తన ఆఫీసులో అభినందించారు. యూపీ రాజధాని లక్నోలోని రైల్వే పోలీస్ అకాడమీలో ఈ నెల12 నుంచి 16వ తేదీ వరకు జరిగిన 67వ ఆల్ ఇండియా పోలీస్​డ్యూటీ మీట్​లో సైబరాబాద్​సీఏఆర్ హెడ్​క్వార్టర్​కు చెందిన ఏఆర్​హెడ్​ కానిస్టేబుల్​దేవేంద్ర ప్రసాద్ పాల్గొని పోలీస్​ఫొటోగ్రఫీలో గోల్డ్ మెడల్ సాధించారు. ఇదే డిపార్ట్​మెంట్​లోని బాంబ్​ డిస్పోజల్ టీంకు చెందిన ఏఆర్​హెడ్​కానిస్టేబుల్​రామకృష్ణరెడ్డి యాంటీ సాబోటేజ్ చెక్​ విభాగం గ్రౌండ్ సర్చ్​లో గోల్డ్ మెడల్​పొందారు. మదాపూర్​ఎస్సైగా పనిచేస్తున్న రమణ సైంటిఫిక్​ఐడ్స్ టూ ఇన్వెస్టిగేషన్​విభాగం–10 ఫొటోగ్రఫీలో సిల్వర్​ మెడల్ సాధించారు.