చిత్తూరులో ఘోరం.. కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి

చిత్తూరులో ఘోరం.. కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి

చిత్తూరులో జిల్లాలో ఘోరం జరిగింది. చౌడేపల్లి పెద్దకొండమరిలో వాటర్ సంపు శుభ్రం చేస్తుండగా విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైరు తెగిపోవడంతో మోటారు ట్యాంక్ లో పడిపోయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఈ ప్రమాదంలో చనిపోయిన వారు  రవికుమార్ (40), రమణ (32), మునిరాజా (27) గుర్తించారు. కేసు నమోదు చేసుకునరి దర్యాప్తు చేస్తున్నారు.