ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య అదివారం (జనవరి 18) మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఇండోర్ వేదికగా హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకుంది. ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్ కావడంతో రెండు జట్లు విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుతం మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ గెలుస్తుంది. దీంతో రెండు జట్లకు విజయం తప్పనిసరిగా మారింది. ఈ మ్యాచ్ లో ముగ్గురు స్టార్ క్రికెటర్ల మధ్య నెంబర్ వన్ ర్యాంక్ సమరమ జరగనుంది.
ఐసీసీ బుధవారం (జనవరి 14) ప్రకటించిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ సహచరుడు రోహిత్ శర్మను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. అయితే రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ కోహ్లీ కంటే కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ మాత్రమే వెనకపడి ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీ 785 రేటింగ్ పాయింట్స్ తో కోహ్లీ టాప్ లో ఉండగా.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 784 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 775 రేటింగ్ పాయింట్స్ తో మూడో స్థానంలో నిలిచాడు.
►ALSO READ | మల్హోత్రా మ్యాజిక్.. బంగ్లాపై యంగ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డేకు ముందు ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకటించింది. బుధవారం (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో కోహ్లీ విఫలం కాగా.. మరోవైపు మిచెల్ సెంచరీతో సత్తా చాటాడు. రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోహ్లీ కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. కివీస్ స్టార్ మిచెల్ మాత్రం ఏకంగా 131 పరుగులతో చెలరేగాడు. ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా త్వరలోనే కోహ్లీ తన టాప్ ర్యాంక్ మిచెల్ కు కోల్పోయే ప్రమాదముంది. కోహ్లీ తన టాప్ ర్యాంక్ ను కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంది. న్యూజిలాండ్ జరగబోయే చివరి వన్డేలో కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడితే అగ్రస్థానం పదిలంగా ఉంటుంది.
అదే సమయంలో మిచెల్ మూడో వన్డేలో విఫలం కావాలి. ప్రస్తుతానికైతే కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. మిచెల్ రెండో ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. ఒకవేళ చివరి వన్దేలో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగి మిచెల్, కోహ్లీ విఫలమైతే హిట్ మ్యాన్ టాప్ ర్యాంక్ ను సొంతమా చేసుకోవచ్చు. ఏదేమైనా మూడో వన్డే తర్వాత ఈ ముగ్గురిలో ఎవరు టాప్ ర్యాంక్ కు చేరుకుంటారో ఆసక్తికరంగా మారింది.
