సిద్దిపేటలో దారిదోపిడీ

సిద్దిపేటలో దారిదోపిడీ

సిద్దిపేట రూరల్, వెలుగు: ముగ్గురు దొంగలు ఆటోడ్రైవర్​ను బెదిరించి రూ. 40 వేల క్యాష్​ ఎత్తుకెళ్లిన ఘటన మంగళవారం సిద్దిపేట పట్టణ శివారులోని రంగదాంపల్లి చౌరస్తా వద్ద జరిగింది. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామానికి చెందిన పస్తం జంపయ్య హైదరాబాద్ లో టాటా ఏస్ ​వాహనం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో హైదరాబాద్​లోని చర్లపల్లి నుంచి కోరుట్ల కు పరుపులను తీసుకువెళుతున్నాడు. సిద్దిపేట పట్టణ శివారులోని రంగధాంపల్లి చౌరస్తా దాటి కొద్ది దూరం వెళ్లగానే టూ వీలర్ పై ముగ్గురు వ్యక్తులు వచ్చి వాహనాన్ని ఆపారు. గంజాయి తరలిస్తున్నావా అంటూ కత్తితో బెదిరించి అతని నుంచి క్యాష్ బ్యాగు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.