ఏపీ అసెంబ్లీ: ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ: ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ(మంగళవారం) సభ ప్రారంభమైనప్పటి నుంచే గందరగోళం సృష్టించారు టీడీపీ ఎమ్మెల్యేలు. దీంతో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పెండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు పోడియం దగ్గరకు దూసుకొచ్చి… స్పీకర్ మైకును లాగేందుకు యత్నించారు. దీంతో ముగ్గురు టీడీపీ సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. వీరిని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా సభలోనే ఉండిపోయిన ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకి తీసుకెళ్లారు.