తీవ్ర విషాదం.. నెల్లూరు జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి

తీవ్ర విషాదం.. నెల్లూరు జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి

ఆకాల వర్షం నెల్లూరు జిల్లాలో విషాదాన్ని నింపింది. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. దగదర్తి మండలం చెన్నూరులో పిడుగుపడి ముగ్గురు గొర్రెల కాపరులు మృతి చెందారు. అంతేకాకుండా బోగోలు మండలం భాస్కరగిరివారి కండ్రిలో పెంచలరెడ్డి(65) అనే వ్యక్తి మృతి చెందాడు. అల్లూరు మండలం పడమరగోగులపల్లిలో సుబ్బారావు(54) అనే వ్యక్తి కూడా మృతి చెందాడు.

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. భారీ వర్షానికి చేతికి వచ్చిన పంట నేలపాలైంది. ఆరుగాలం శ్రమించిన రైతాంగానికి చివరికి కన్నీరే మిగిలింది. అసలే కరోనా వల్ల వ్యవసాయరంగం కుదేలైంది. పంట దిగుబడులు అమ్ముకోడానికి వీల్లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పొలాల్లో, కల్లాల్లో ఉన్న పంట తడిసిపోయింది. వైరస్‌కు వర్షాలు తోడై నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.