తిర్యాణి అడవుల్లో పులి సంచారం

తిర్యాణి అడవుల్లో పులి సంచారం

తిర్యాణి, వెలుగు: తిర్యాణిలో పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. బుధవారం రవటసంకేపల్లి, చోపిడీ అటవీ ప్రాంతాల్లో పులి పాదముద్రలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 

అటవీ ప్రాంతాలకు సమీప గ్రామస్తులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేంజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పశువుల కాపరులు, రైతులు ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని, గుంపులుగా చేనులోకి వెళ్లాలని సూచించారు. పులి సంచారంపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే అటవీ అధికారులకు తెలియజేయాలన్నారు.