సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా 2024 మార్చి 29వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. డీజే టిల్లుకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ పార్ట్ కు మించి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.
No caption, Only action! In Theatres all around you from 29th March 2024 ?#TilluSquareOnMarch29th ?#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/NoeqWCtvBx
— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2024
మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సాయి సౌజన్య సహ నిర్మాత. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా పతాకాలపై ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ సినిమాపై మంచి ఇంఫాక్ట్ క్రియేట్ చేశాయి. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ.. అదే రోజున రవితేజ ఈగల్ మూవీ రిలీజ్ ఉండటంతో టిల్లు స్క్వేర్ ను వాయిదా వేసి మార్చికి షిప్ట్ చేశారు.