‘డీజే టిల్లు’గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ.. ఈ నెల 29న ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ మై లిల్లీ’ సాంగ్ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ఈవెంట్లో సిద్ధు మాట్లాడుతూ ‘ఫస్ట్ పార్ట్ కంటే ఈ చిత్రం రెట్టింపు వినోదం ఇస్తుంది. యూత్ఫుల్ డోస్తో అందర్నీ ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు. ‘నా కెరీర్లో చేసిన మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్ ఇది. రిలీజ్ కాకముందే ఈ సినిమాకొస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఎక్సయిటింగ్గా ఉంది’ అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్.
ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నామని దర్శకుడు మల్లిక్ రామ్ చెప్పాడు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘సమ్మర్లో రానున్న ఫస్ట్ మూవీ కావడంతో మాకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నాం’ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి, లిరిసిస్ట్ ఆంటోనీ కార్యక్రమంలో పాల్గొన్నారు.