ఆపరేషన్ మహదేవ్ టైమింగ్ సరికాదు : ఎస్పీ ఎంపీ అఖిలేశ్ యాదవ్

ఆపరేషన్  మహదేవ్  టైమింగ్ సరికాదు : ఎస్పీ ఎంపీ అఖిలేశ్  యాదవ్

న్యూఢిల్లీ: ‘ఆపరేషన్  మహదేవ్’ టైమింగ్  సరికాదని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్​  యాదవ్  అన్నారు. ఆ మిలిటరీ యాక్షన్​తో రాజకీయంగా లబ్ధి పొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఆపరేషన్  సిందూర్ పై మంగళవారం (జులై 29) లోక్ సభలో జరిగిన చర్చలో అఖిలేశ్​  మాట్లాడారు. 

‘‘సోమవారమే ఆపరేషన్  మహదేవ్  ఎందుకు చేపట్టారు? టైమింగ్  కరెక్ట్ గా ఉన్నపుడు ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. కానీ, సోమవారం చేపట్టిన ఆపరేషన్ కు నేను మద్దతు తెలపడం లేదు. ఎందుకంటే ఆ ఆపరేషన్  చేపట్టిన టైమింగ్  కరెక్టు కాదు. అంతేకాకుండా ఈ విషయాన్ని బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేయాలనుకుంటోంది. అలాగే, 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిపైనా నాకు కొన్ని సందేహాలున్నాయి. పేలుడు పదార్థాలతో ప్రవేశించిన ఆ వాహనంలో అవి ఎక్కడి నుంచి వచ్చాయి? దీనిపై ప్రభుత్వం ఎందుకు దర్యాప్తుకు ఆదేశించడం లేదు? ప్రభుత్వానికి ధైర్యం లేదా?” అని అఖిలేశ్​  ప్రశ్నించారు.