- ఓవర్ స్పీడ్తో రైట్ సైడ్ వెళ్లి బస్సును ఢీకొట్టాడు: డీజీపీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్దే తప్పు అని ప్రాథమికంగా నిర్ధారించామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఓవర్ స్పీడ్, ఓవర్ కంకర లోడ్తో రైట్ సైడ్ వెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడని.. దాదాపు 40 మీటర్లు బస్సును లాక్కెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. మంగళవారం అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, సీపీ అవినాశ్ మహంతితో కలిసి ఘటనా స్థలాన్ని డీజీపీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. మలుపు ఉన్నప్పటికీ, అది ప్రమాదం జరిగేంత తీవ్రంగా లేదన్నారు. బస్సులో రైట్ సైడ్ ఉన్నవాళ్లే ఎక్కువగా చనిపోయారని తెలిపారు. టిప్పర్ కండీషన్ను మెకానిక్ ద్వారా చెక్ చేయిస్తున్నామన్నారు. టిప్పర్ ఓనర్ లక్ష్మణ్ నాయక్ కూడా ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. చేవెళ్ల ఏసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతున్నదని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వ సమస్య కోణంలో కాకుండా సమాజ బాధ్యత కోణంలో చూడాలని సూచించారు.
రోడ్డు సేఫ్టీపై అవగాహన..
రోడ్డు ప్రమాదాలు పెద్ద సమస్యగా మారుతున్నాయని, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. డిఫెన్స్ డ్రైవింగ్ పాటించాలని, రోడ్డు కండీషన్ అంచనా వేసి డ్రైవ్ చేయాలని కోరారు. రోడ్డు సేఫ్టీకి సంబంధించి వచ్చే నెల నుంచి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. స్కూల్స్, కాలేజీలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేసి ముందుకెళ్తామని చెప్పారు. పోలీస్, ఆర్అండ్బీతో పాటు అన్ని శాఖలు, సంస్థలు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
