తిరుమలలో తగ్గిన రద్దీ.. 10 గంటల్లో ఉచిత దర్శనం

తిరుమలలో తగ్గిన రద్దీ.. 10 గంటల్లో ఉచిత దర్శనం

కలియుగ వైకుంఠం తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తోంది .  అయితే వేసవి సెలవులు ముగియడంతో రద్దీ కొంతమేరకు తగ్గిందని టీటీడీ అధికారులు తెలిపారు.   సర్వదర్శనం కోసం టోకెన్లు లేకుండా క్యూలో వేచి ఉన్న భక్తులు శ్రీవారి దర్శనం కోసం సుమారు 12 నుండి 20 గంటలు పడుతుంది.  తొమ్మిది కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు దర్శనం కోసం సుమారు 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలుగకుండా VIP సిఫార్సు లేఖలను రద్దు చేసింది. బ్రేక్ దర్శనాలపై ఈ ఆంక్షలు జూలై 15 వరకు అమలులో ఉంటాయి.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ అధికారులు క్యూ విధానంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెండి వాకిలి నుంచి సింగిల్ క్యూలైన్ విధానం సాటించడంతో అత్యధిక భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకున్నారు.