తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. అక్టోబర్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల షెడ్యూల్ వివరాలు ఇవే..!

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. అక్టోబర్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల షెడ్యూల్ వివరాలు ఇవే..!

తిరుమ‌ల శ్రీ‌వారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది.  అక్టోబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు..  సుప్రభాతం, తోమ‌ల‌, అర్చన‌, అష్టదళ పాదపద్మారాధన సేవల  వివరాలను ప్రకటించింది. ఈనెల 22న ఆర్జిత సేవా టికెట్లు, 24వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది.

అక్టోబర్ నెల  తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు వివరాలు..

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి టీటీడీ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన టికెట్ల కోటా వివరాలను ప్రకటించింది..

22న ఆర్జిత సేవా టికెట్లు: కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను జూలై 22న ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి.

ALSO READ : ఆధ్యాత్మికం: జ్ఞానం అంటేఏమిటి.. దానిని ఎలా పొందాలి.. శ్రీకృష్ణుడు అర్జుడికి చెప్పింది ఇదే.!

22న వర్చువల్ సేవల కోటా:వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు: అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా: శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు:

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా : ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా : తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

 శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లతో పాటు శ్రీవారి దర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఇతర వెబ్ సైట్లను నమ్మి... మోసపోవద్దని సూచించింది. ఫేక్ వెబ్ సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.