తిరుమల శ్రీవారి దర్శనం పరిమిత సంఖ్యలో మాత్రమే

తిరుమల శ్రీవారి దర్శనం పరిమిత సంఖ్యలో మాత్రమే

తిరుమల తిరుపతిలో ఒకేసారి లక్షలాది మంది శ్రీవారి దర్శించుకోవడం ఇకపై సాధ్య కాదన్నారు టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాతనే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పిన ఆయన…. లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా క్యూలైన్లలో మార్పులు ఉంటాయన్నారు. భక్తులకు మాస్కులు, శానిటైజర్లు వంటి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వాల సూచనల ప్రకారం మళ్లీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పారు. అయితే స్వామివారి దర్శనానికి  గతంలోలా వేలు, లక్షల మందికి అనుమతించమని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.